కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఆర్సీబీ..

105
punjab
- Advertisement -

కీలకమ్యాచ్‌లో చేతులెత్తేసింది ఆర్సీబీ. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది. ఒక్క మ్యాక్స్‌వెల్ తప్ప మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. పంజాబ్‌ బౌలర్లలో రబాడ మూడు, రాహుల్‌ చాహర్‌, రిషిదావన్‌ చెరో వికెట్లు తీశారు.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఆది నుండే ఆర్సీబీ బౌలర్లపై విరుచుకపడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. లివింగ్‌స్టోన్(70), జానీ బెయిర్‌స్టో(66) పరుగులతో చెలరేగారు. ఆర్‌సీబీ బౌలర్లలో హార్షల్‌ పటేల్‌ నాలుగు వికెట్లు, హాసరంగా రెండు, మాక్స్‌వెల్‌, షబాజ్‌ ఆహ్మద్‌ చెరో వికెట్‌ సాధించారు.

- Advertisement -