రాణించిన రాహుల్…పంజాబ్ గెలుపు

176
kkr
- Advertisement -

ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఉత్కంఠపోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్,అగర్వాల్ రాణించడంతో పంజాబ్ విజయం సాధించింది.

కోల్ కతా విధించిన 167 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 168 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(67: 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మయాంక్ అగర్వాల్(40: 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 165 పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యారు 67,త్రిపతి 34,నితీశ్‌ రానా 31 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3,బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టారు. హాఫ్ సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -