క‌రోనా ఎఫెక్ట్… భారీ న‌ష్టాల్లో టాలీవుడ్ అగ్ర నిర్మాత

262
dil raju
- Advertisement -

క‌రోనా వైర‌స్ ప్రపంచ‌వ్యాప్తంగా భయాంధోన‌ల‌కు గురి చేస్తుంది. ఈ వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 30వేల మంది మ‌ర‌ణించ‌గా..7ల‌క్ష‌ల‌కు పైగా మందికి పాజిటివ్ వ‌చ్చింది. కాగా క‌రోనా వ‌ల్ల చాలా బిజినెస్ లు లాస్ అయ్యాయి. క‌రోనా ప్ర‌భావం సినిమా రంగంపై కూడా ప‌డింది. అయితే టాలీవుడ్ లో అగ్ర నిర్మాత గా ఉన్న దిల్ రాజు భారీ మొత్తంలో లాస్ అయిన‌ట్లు తెలుస్తుంది. దిల్ రాజు బ్యాన‌ర్ లో వి మూవీని నిర్మించాడు. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈచిత్రంలో నాని, సుధీర్ బాబులో హీరోలుగా న‌టించారు. ఈమూవీ ఈనెల 25 విడుద‌ల కావాల్సి ఉంది.

క‌రోనా నేప‌థ్యంలో ఆ మూవీ వాయిదా ప‌డింది. ఈమూవీ కోసం దిల్ రాజు రూ.40కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలుస్తుంది. దీంతో పాటు ప‌వన్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న వ‌కీల్ సాబ్ మూవీ కూడా తెర‌కెక్కిస్తున్నారు. ఈమూవీ షూటింగ్ ఇప్ప‌టికే స‌గం వ‌ర‌కు పూర్తి చేసుకుంది. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈమూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో పాటు తెలంగాణ‌లో స‌గం వ‌ర‌కు థియేట‌ర్లు దిల్ రాజు ఆధీనంలోనే ఉన్నాయి. సినిమాలు కూడా న‌డ‌వ‌క‌పోవ‌డంతో ఆదాయం కూడా లేదు. దీంతో దిల్ రాజు క‌రోనా ప్ర‌భావంతో న‌ష్టాల్లో ఉన్నాడ‌ని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి.

- Advertisement -