రాహుల్ బాటలో ప్రియాంక!

148
priyanka
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోంది. ఏ రాష్ట్రం వెళ్లిన ప్రజలు రాహుల్‌కు బ్రహ్మారథం పడుతున్నారు. స్ధానికంగా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్.

ఇప్పుడు రాహుల్ బాటలోనే నడిచేందుకు ఆయన సోదరి ప్రియాంక సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది రెండు నెలలపాటు ప్రియాంక…మహిళా మార్చ్ ను నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. జనవరి 26 నుంచి మార్చి 26 వరకు పాదయాత్ర కొనసాగుతుందని, అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ ఇది జరుగుతుందని ఆయన వివరించారు.

రాహుల్ భారత్ జోడో యాత్ర ముగింపు రోజునే ప్రియాంక మహిళా మార్చ్ ప్రారంభం కానుండడం విశేషం. జోడో యాత్ర తర్వాత పార్టీ కార్యచరణపై విస్తృతంగా చర్చించింది కోర్ కమిటీ. ఈ నేపథ్యంలో ప్రియాంక పాదయాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఆ పార్టీ నేతలు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -