సుకుమార్ కు షాక్…ఫన్ డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చిన మహేష్

244
anil ravipudi mahesh
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 25వ సినిమా మహర్షిలో బిజీగా ఉన్నాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈసినిమాలో మహేశ్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఎప్రిల్ లో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. మహేశ్ తన తర్వాతి చిత్రం సుకుమార్ తో చేయనున్నడని ఫిలీం నగర్ వర్గాల సమాచారం. అయితే సుకుమార్ సిద్ధం చేసిన కథ నచ్చకపోవడంతో, ఆయన మరోలైన్ వినిపించి ఓకే చేసుకున్నాడని సమాచారం. సుకుమార్ కథ రెడీ చేసేందుకు 6నెలలు సమయం అడగడంతో అంతలోపు వేరే సినిమా చేయాలని భావిస్తున్నాడు మహేశ్.

 Mahesh Sukumar

ఇటివలే దర్శకుడు అనిల్ రావిపూడి మహేశ్ ను కలిసి ఒక స్టోరీని వినిపించాడట. అనిల్ చెప్పిన లైన్ నచ్చడంతో స్క్రీప్ట్ రెడీ చేయమని చెప్పాడట మహేశ్. తాజాగా అనిల్ కు ఫోన్ చేసి పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసి రంగంలోకి దిగిపొమ్మని చెప్పాడట. ప్రస్తుతం అనిల్ రావిపూడి అదే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈవార్తలో నిజమెంతుందో తెలియాలంటే ఈచిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

- Advertisement -