జనవరి 5న “ప్రేమకథ”

28
- Advertisement -

కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “ప్రేమకథ”. ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఉపేందర్ గౌడ్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ప్రేమకథ” సినిమా జనవరి 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ట్రైలర్ దాకా ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది “ప్రేమకథ” సినిమా. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ‘ఎవడు మనోడు…’ లిరికల్ సాంగ్ తో పాటు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వైవిధ్యమైన లవ్ స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిన “ప్రేమకథ” సినిమాకు థియేటర్స్ లోనూ మంచి ఆదరణ దక్కుతుందని మూవీ టీమ్ నమ్మకంతో ఉన్నారు.

Also Read:టీఎస్‌పీఎస్సీపై సీఎం రేవంత్

- Advertisement -