ప్రశాంత్ కిశోర్…పాదయాత్ర అప్‌డేట్

67
pk
- Advertisement -

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తన దేశ వ్యాప్త పాదయాత్రను నేటి నుంచి ప్రారంభించనున్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా 3,500 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరగనుంది. జన్‌ సురాజ్‌ ప్రచారంలో భాగంగా బిహార్ లోని తూర్పు చంపారన్‌ జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగనుంది.

దాదాపు 18 నెలల పాటు ఈ పాదయాత్ర జరగనుండగా బిహార్‌లోని ప్రతి పంచాయతీ, బ్లాక్‌లను సందర్శించనున్నారు ప్రశాంత్ కిశోర్. పాదయాత్రలో మధ్యలో ఎలాంటి బ్రేక్‌ తీసుకోరు. కాగా, 1917లో మహాత్మా గాంధీ తొలి సత్యాగ్రహ ఉద్యమాన్ని చంపారన్ నుంచే ప్రారంభించారు.

యాత్రలో భాగంగా పార్టీ కోసం నేతలను గుర్తించటం, వారిని ప్రోత్సహించడం, పలు రంగాల్లోని నిపుణుల ఆలోచనలను అమలు చేసేలా విధానాలు రూపొందించడం లక్ష్యంగా పాదయాత్ర ఉండనుంది.

- Advertisement -