కాంగ్రెస్‌లో చేరిండి… పీకేకు ఆహ్వానం!

104
prashant
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో చేరాలని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను ఆహ్వానించారు కాంగ్రెస్ నేతలు. 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు ప్రశాంత్ కిశోర్. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పైనే సుదీర్ఘ‌మైన ప్రెజెంటేష‌న్ ఇచ్చారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎలా ముందుకు వెళ్లాల‌న్న దానిపై ఓ రోడ్ మ్యాప్‌ను కూడా ఇచ్చారు. ఆ త‌ర్వాత నాయకుల అభిప్రాయాలను సేకరించారు సోనియా. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరాలని పీకేను కోరారు నేతలు.

ఇక ప్రశాంత్ ఇచ్చిన ప్రెజెంటేష‌న్‌పై సోనియా గాంధీ ఓ వారంలో నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఈ స‌మావేశంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, అంబికా సోనీ, దిగ్విజ‌య్ సింగ్‌, మ‌ల్లికార్జున ఖ‌ర్గే పాల్గొన్నారు.

- Advertisement -