17 నుండి ప్రాణహిత పుష్కరాలు..

77
pranahitha pushkaralu
- Advertisement -

ప్రాణహిత పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 17 నుంచి 24 వరకు ప్రాణహిత పుష్కరాలు జరగనున్నాయి. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టి వద్ద నిర్వహించనున్న ప్రాణహిత పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై నిర్వహించారు కలెక్టర్ రాహుల్ రాజ్.

ప్రాణహిత పుష్కరాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గతంతో పోలిస్తే ప్రస్తుత పుష్కరాలకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.పుష్కర ఘాట్లు, రహదారులు, అంతర్గత రహదారులతో పాటు అనుసంధాన రహదారుల పనులు పూర్తి చేయాలన్నారు.

వేసవి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లతో పాటు పిండప్రదానాలు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాల నిలుపుదల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని తెలిపారు.అన్ని శాఖల అధికారులకు చేసే పనులకు సంబంధించి లక్ష్యాలు నిర్ధేశించాలని నిర్దేశించిన గడువు లోపు పనులు పూర్తి చేయాలన్నారు.

- Advertisement -