Prakashraj:శశిథరూర్‌దే తిరువనంతపురం

11
- Advertisement -

శశిథరూర్ తనకు మంచి మిత్రుడని…తిరువనంతపురంలో ఆయన గెలుపును ఎవరు ఆపలేరన్నారు నటుడు ప్రకాశ్ రాజ్. గత దశాబ్దకాలంగా ఆయన నుండి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.శ‌శి థ‌రూర్ మ‌రోసారి గెలిచి.. లోక్‌స‌భ‌కు వెళ్తార‌ని,ఆయనకు అండ‌గా నిల‌బ‌డ‌డానికే తిరువ‌నంత‌పురం వ‌చ్చాను అని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి వ్య‌క్తిని మ‌నం ఎన్నిక‌ల్లో గెలిపించుకోవాల‌న్నారు.

తాను ఓ నటుడినని, రాజకీయ నేతను కాదని, కానీ సామాన్య ప్రజలు రాజకీయాలపై కూడా మాట్లాడవచ్చని ప్రకాష్ రాజ్ తెలిపారు. తాను మౌనంగా ఉండకపోవడం వల్లే ప్రజలు తనను ఇష్టపడతారన్నారు.

ఇక శశిథరూర్‌పై పోటీ చేస్తున్న బీజేపీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై మండిపడ్డారు ప్రకాశ్ రాజ్. 18 ఏళ్ల పాటు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన రాజీవ్ చంద్రశేఖర్ ఆ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదన్నారు.

Also Read:రచయితగా మారిన అల్లరి నరేష్..

- Advertisement -