కేసీఆర్‌ను పరామర్శించిన ప్రకాశ్ రాజ్,మాజీ మంత్రులు

14
- Advertisement -

హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్  ని సినీ నటుడు ప్రకాశ్ రాజ్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్  పరామర్శించారు.

సోమవారం రోజు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందుతో కలిసి సత్యవతి రాథోడ్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ గారితో మాట్లాడిన సత్యవతి రాథోడ్ గారికి తన ఆరోగ్యం బాగానే ఉందని అందరూ ధైర్యంగా ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు.

- Advertisement -