వామ్మో ప్రభాస్ నాన్ స్టాప్ దూకుడు..?

31
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ గతంలో ఎన్నడూ లేని విధంగా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి ఒక్క సినిమానే పూర్తి చేయడానికి స్టార్స్ నానా తంటాలు పడుతుంటే డార్లింగ్ మాత్రం ఏడాదికి రెండు గ్యారెంటీ అని అభిమానులకు భరోసా ఇస్తున్నాడు. బాహుబలి సిరీస్ తరువాత దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాధించుకున్న ప్రభాస్.. ఆ తరువాత సాహో మూవీ చేశారు. ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ అయినప్పటికి హిందీలో మాత్రం అధిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. ఇక సాహో మూవీతో పాటే రాధేశ్యామ్ మూవీ చేసిన ప్రభాస్ ఆ మూవీతో డిజాస్టర్ అందుకున్నాడు.

ఇక అప్పటికే ప్రభాస్ చేతిలో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే ( కల్కి 2898 ఏడి ), స్పిరిట్ వంటి ప్రాజెక్ట్స్ కు కమిటై అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇక ఈ ఏడాది జూన్ లో రిలీజ్ అయిన ఆది పురుష్ ఫ్లాప్ అయినప్పటికి సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే సలార్ తో రికార్డులు తిరగరాయాలని ప్రభాస్ కసితో ఉన్నాడు. ఆ తరువాత వచ్చే ఏడాది ప్రాజెక్ట్ కే మూవీతో పాటు మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజా డీలక్స్ ను మూవీని కూడా విడుదల చేయాలని ప్లాన్ లో ఉన్నాడు. ఇక ఇప్పటికే చేతినిండా సినిమాలతో ఉన్న డార్లింగ్ మరో రెండు ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read:పోలవరం ప్రాజెక్ట్.. కథ కంచికే!

ప్రస్తుతం సలార్ మూవీలో విలన్ గా నటిస్తున్న మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ తో ఓ సినిమాకు ఒకే చెప్పినట్లు టాక్. ఈయన మలయాళంలో గాడ్ ఫాదర్, బ్రో దాడి వంటి మూవీస్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇటీవల ప్రభాస్ కు పృధ్వీ రాజ్ ఒక స్టోరీ లైన్ కూడా వినిపించడట. ఇక క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కూడా ప్రభాస్ కు ఒక పీరియాడిక్ స్టోరీ వినిపించడాని, అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి స్టార్స్ కు ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరుస ప్రాజెక్ట్స్ ను ఒప్పుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు ప్రభాస్.

Also Read:బండి సంజయ్ తెలంగాణకు దూరం అవుతారా?

- Advertisement -