స‌లార్ రిలీజ్ ఖరారు.. తర్వాత కొరటాలతోనే

22
- Advertisement -

ప్ర‌భాస్ స‌లార్ సినిమా రిలీజ్ డేట్‌పై కొన్ని రోజులుగా నెల‌కొన్న స‌స్పెన్స్ వీడింది. డిసెంబ‌ర్ 22న వ‌ర‌ల్డ్ వైడ్‌గా స‌లార్ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తూ ప్ర‌భాస్ కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. దీంతో డార్లింగ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్ తో హోంబ‌లే ఫిల్మ్స్ ప‌తాకంపై విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తున్నారు. ఇక ప్ర‌భాస్ మోకాలి స‌ర్జ‌రీ కోసం యూరప్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌ర్జ‌రీ స‌క్సెస్ అయిన‌ట్లు స‌మాచారం.

అయితే, స‌ర్జ‌రీ త‌ర్వాత కూడా ప్ర‌భాస్ అక్టోబ‌ర్ నెల మొత్తం అక్క‌డే రెస్ట్ తీసుకోనున్నార‌ని, తిరిగి న‌వంబ‌ర్ నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నాడ‌ని ప్ర‌భాస్ స‌న్నిహితులు చెప్తున్నారు. ప్ర‌స్తుతం సలార్ సినిమా చేస్తున్న ప్రభాస్, ఆ త‌ర్వాత సినిమాను కొరటాల శివతో చేస్తాడట. ఐతే, రీసెంట్‌గా ఈ సినిమా కంటే ముందు మ‌హేష్, అనిల్ రావిపూడితో త‌న తర్వాత సినిమా చేయ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఈ వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని టాక్.

Also Read:చేపనూనె వాడితే ప్రమాదమా ?

అన్నట్టు తాను నటించిన ఘోస్ట్ సినిమా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అభిమానులతో సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ చాట్‌లో ఓ అభిమాని జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రభాస్ ల గురించి అడగ్గా.. ప్రభాస్ నిజమైన పాన్ ఇండియా స్టార్ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే ఎన్టీఆర్ గురించి చెబుతూ.. కన్నడ మాట్లాడాలంటే విశాల హృదయం ఉండాలి. ఆ విశాల హృదయం NTRకు ఉంది. మా కుటుంబంలో అందరం NTRను అభిమానిస్తాం. అతడికెప్పుడూ మంచి జరగాలని కోరుకుంటాం అని అన్నారు.

Also Read:చంద్రబోసుకు ఘనంగా సన్మానం..

- Advertisement -