వరుస సినిమాలతో ఫ్యాన్స్కు కిక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న హీరో ప్రభాస్…మారుతి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.
డివివి దానయ్య నిర్మాతగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే సదరు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం చక చకా జరుగుతున్నాయి.
ఔట్ డోర్ షూటింగ్స్కు వెళ్లకుండానే సినిమాను పూర్తి చేసేలా మారుతి కథను సిద్ధం చేయగా ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ను నిర్మిస్తున్నారట. టీ టౌన్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్ట్ నుంచి ప్రభాస్ – మారుతి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఫ్యామిలీ ఎలిమిమెంట్స్తో పాటు హారర్ ఎలిమెంట్స్ను మిక్స్ చేసి మారుతి ఫన్నీగా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు టాక్.
ఇక ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా షూటింగ్ను పూర్తి చేశారు ప్రభాస్. ప్రశాంత్ డైరెక్షన్లో సలార్ ,నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K షూటింగ్ కూడా జరుగుతోంది. ఆది పురుష్ వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న సంగతి తెలిసిందే.