అటు సలార్ ఇటు ప్రాజెక్ట్ కే.. ఫుల్ జోష్

36
- Advertisement -

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా సలార్. ఈమూవీ నుంచి టీజర్ విడుదలై ఆకట్టుకుంది. కాగా ఈ టీజర్ విడుదలైన 52 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. వంద మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ అఫిషియల్‌గా ఇన్ స్టా‌లో పోస్ట్ పెట్టారు. ఇక ‘సలార్‌’ ట్రైలర్‌ పై చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ తాజాగా ట్వీటర్ లో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మా టీజర్‌ను ఆదరించినందుకు ధన్యవాదాలు. భారతీయ సినిమా పరాక్రమానికి ఇదొక ప్రతీక. మీ ఆదరణ చూశాక.. అసామాన్యమైన చిత్రాన్ని అందించాలనే కోరిక మరింత బలపడింది.

ఆగస్టు నెలను మార్క్‌ చేసుకుని పెట్టుకోండి. భారతీయ సినీ వైభవాన్ని చాటి చెప్పేలా అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్‌ను మీ కోసం తీసుకురానున్నాం’ అని తెలియజేసింది. మరి ‘కేజీఎఫ్​’తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. సలార్ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పైగా ఈ సినిమా టీజర్ కూడా సూపర్ హిట్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అటు ప్రభాస్ నుంచి రాబోతున్న మిగిలిన సినిమాల పై కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read:Harish:అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు
ఈ క్రమంలో నే ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కే’. ఈ సినిమా నుంచి ఈరోజు రాత్రి 7.10 గంటలకు బిగ్ అప్డేట్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పఠాని, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇఫ్పటికే వీరిందరికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Also Read:BRS:తిరుగులేని రాజకీయ శక్తి

- Advertisement -