మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు-ప్రభాస్

244
Prabhas finally breaks silence Karan Johar Issue
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ప్రభాస్ స్పందించాడు. దుబాయ్‎లో సాహో సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తైంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ మాట్లాడుతూ మా మధ్య ఎలాంటి వివాదం లేదని చెప్పారు. మా ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్లు వస్తోన్న వార్తలను కరణ్‌ జోహార్ తనకు ఫోన్ చేసి చెప్పారని అన్నారు.

Prabhas finally breaks silence Karan Johar Issue

ఇలాంటి పుకార్లను నమ్మొద్దని, ఇదంతా అబ్ధమని ప్రభాస్ చెప్పుకొచ్చారు. అయితే బాలీవుడ్‎కు ప్రభాస్‎ను పరిచయం చేయాలని కరణ్ జోహార్ ప్రయత్నించారని అందుకు ప్రభాస్ నిరాకరించాడనే వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రభాస్ చేసిన ప్రకటనతో ఈ వదంతులకు చెక్ పడింది.

మరోవైపు ప్రభాస్ నటిస్తున్న సాహో భారీ బడ్జెత్‎తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్‎లో ఫైట్ సీన్స్ ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. దుబాయ్‎లో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించారని, రియాల్టీ కోసం ప్రభాస్ కూడా ఈ చిత్రంలో డూప్ లేకుండా నటిస్తున్నాడని అంటున్నారు. ఒక్క ఫైట్ సీన్ కే రూ.90 కోట్లు ఖర్చు చేసినట్లు ఫిలింనగర్‎లో టాక్ వినిపిస్తోంది.

- Advertisement -