ఏపీ ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం…

262
pothula sunitha
- Advertisement -

ఏపీ ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె ఒక్కరే ఎమ్మెల్సీ స్ధానానికి నామినేషన్ దాఖలు చేయడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది.

టీడీపీ నుండి ఎమ్మెల్సీగా గెలిచిన పోతుల సునీత తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అనంతరం తిరిగి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి‌ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- Advertisement -