కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులుగా పొన్నం రవిచంద్ర

605
ponnam Ravi chadnra
- Advertisement -

కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులుగా పొన్నం రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు ఫిలిం భవన్ లో జరిగిన 42 వ సర్వసభ్య సమావేశంలో 2020 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కోలా రామచంద్ర రెడ్డి, సయ్యద్ ముజఫర్, సంయుక్త కార్యదర్శులుగా టి. దశరథం, బలమూరి రమేష్ రావు, సభ్యులుగా వరాల మహేష్, లక్ష్మణ్ కుమార్, నార్ల చంద్రమౌళి, ఎం. ప్రభాకర్, సి. హెచ్. అనిల్, రఘురాం, వెంకటేశ్వర రావు, రాంచంద్రం, ఇష్రాత్ సుల్తానా, మాడిశెట్టి గోపాల్, జి. నాగభూషణం, భూనాథ చారి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్. చంద్ర ప్రభాకర్ ప్రకటించారు.

కాగా ఈ కార్యక్రమంలో కపిసో సలహాదారులు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, నరెడ్ల శ్రీనివాస్, వారాల ఆనంద్, కపిసో సభ్యులు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గౌరవ అధ్యక్షులుగా కొనసాగే ఈ సంస్థకు సలహాదారులుగా నారదాసు లక్ష్మణ రావు, నరెడ్ల శ్రీనివాస్, వారాల ఆనంద్ వున్నారు.

- Advertisement -