కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోవడం ఖాయం: మాజీ ఎంపీ పొన్నం

114
ponnam
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో హుజురాబాద్ ఉప ఎన్నికల పోస్టుమార్టమ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఉప ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జ్‌ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉపఎన్నిక ఇన్‌చార్జ్‌గా తనను బాధ్యుడిని చేసే విమర్శలు అర్థరహితం అంటూ మండిపడ్డారు.

సమన్వయ లోపమే పార్టీ ఘోర ఓటమికి కారణం అని…గతంలో పనిచేసిన ఇద్దరు పీసీసీ అధ్యక్షులు కే కేశవరావు, డీ శ్రీనివాస్‌లు రాజ్యసభ సభ్యులయ్యేందుకు కాంగ్రెస్‌ పార్టీని మోసం చేశారు. మరో పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోదరుడు (కజిన్‌) కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -