దిశ ఇంటివద్ద భద్రత పెంపు

376
priyanka reddy house
- Advertisement -

దిశ హత్య కేసులో నిందితులు నలుగురిని ఇవాళ ఉదయం ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. కేసు రీకన్ స్ట్రక్షన్ విషయంలో నిందితులను ఘటన జరిగిన స్ధలానికి తీసుకెళ్లారు పోలీసులు. అయితే అదే సమయంలో నిందితులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో తమ ఆత్మరక్షణ కోసం ఎన్ కౌంటర్ చేసినట్లు తెలిపారు సీపీ సజ్జనార్.

నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన నేపథ్యంలో ఆమె ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఎవరయినా గుర్తు తెలియని వ్యక్తులు గుంపులో వచ్చి దిశ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడే అవకాశం ఉన్నందున పోలీసుల సిబ్బంది దిశ ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉంచారు. ఒక ఎస్సై, ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు, నలుగురు పురుష కానిస్టేబుళ్లతో భద్రత ఏర్పాటు చేశారు.

అంతేకాక, ఇంట్లోకి ఎవరినీ అనుమతించవద్దని స్పెషల్‌ టీంకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. దిశకు సరైన న్యాయం చేశారంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -