దిశ హత్య కేసు.. పోలీసులకు రూ.లక్ష నజరానా

471
Cp
- Advertisement -

దిశ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీపీ సజ్జనార్ కు ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. మరికొంత మంది సీపీ సజ్జనార్ ఫోటోకు పాలాభిషేకం చేస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా హైదరాబాద్ పోలీసులపై కితాబులు వర్షం కురిపిస్తున్నారు.

నలుగురు నిందితులను చంపేసిన పోలీసులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు హర్యాణకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త నరేశ్ సెల్పార్. నిందితులను కాల్చి చంపిన టీమ్ లోని పోలీసులకు రూ. లక్ష చొప్పున నజరానా ఇస్తానని ప్రకటించారు. తెలంగాణ పోలీసులు నిందితులను చంపేసి, చాలా మంచి పని చేశారని కొనియాడారు రాహ్ గ్రూప్ చైర్మన్ అయిన నరేశ్. దిశ ఆత్మకు శాంతి కలిగిందని, సజ్జనార్ మహిళలకు పెద్ద భరోసా ఇచ్చారని తెలిపారు.

- Advertisement -