టీవీ5 ఎండీపై పోలీసు కేసు నమోదు..

234
- Advertisement -

జూబ్లీహిల్స్ కోపరేటివ్ అధ్యక్షుడు, టీవీ5 ఎండీ రవింద్ర నాయుడు పైన పోలీసు కేసు నమోదయ్యింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ కోపరేటివ్ సభ్యుడు సురేష్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని అతి తక్కువ ధరకే అమ్మేశారని ఆరోపణలు చేశారు. సర్వసభ్య సమావేశం నిర్వహించకుండానే గుట్టుచప్పుడు కాకుండా 355 గజాల స్థలాన్ని పార్వతి దేవి అనే మహిళకు అమ్మేశారని సురేష్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాదాపు ఏడు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కోటి 65 లక్షల రూపాయలకు అమ్మినట్లు పేర్కొన్నారు. జిహెచ్ఎంసికి సంబంధించిన పార్కు స్థలాన్ని సొసైటీ స్థలంగా చూపెట్టి అమ్మకాలు జరపా రంటూ సురేష్ బాబు తన ఫిర్యాదులో తెలిపారు.

కోట్లాది రూపాయల స్థలాన్ని గజం 45 వేలకు పార్వతి దేవి కి విక్రయించారని దీని వల్ల సొసైటీకి 5 కోట్ల మేర నష్టం జరిగిందని సురేష్ బాబు జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు జూబ్లీహిల్స్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్ర నాయుడుతో పాటు కోశాధికారి నాగరాజుపై కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇక్కడే ఇంకొక వివాదం తెరపైకి వచ్చింది. తమ స్థలం కబ్జాకు గురైదంటు జిహెచ్ఎంసి అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. సదరు స్థలం జిహెచ్ఎంసికి సంబంధించిందని అందులో నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. రవీంద్ర (టీవి5 ) చైర్మన్ అయ్యాక 3 నెలలైనా కాకముందే  అక్రమాలకు తెరలేపారు.

- Advertisement -