ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి భద్రత పెంపు

127
MLA Rohith
- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించడం దీని కోసం వంద కోట్లు డీల్‌కు రాగా అదికాస్త లీకవడంతో బీజేపీ నేతలు చిక్కుల్లో పడ్డారు.

ఇక ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఇక ఎమ్మెల్యేకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం రోహిత్ రెడ్డికి 2+2 భద్రత ఉండగా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సంఖ్యను 4+4కి పెంచింది. దీంతోపాటు ఆయనకు బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని కూడా కేటాయిచారు.

ఇవి కూడా చదవండి..

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. రెండో ఆడియో లీక్

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఆడియో వైరల్

కృష్ణా బోర్డు దండగ

- Advertisement -