ప్రాంతీయ పార్టీలన్నీ అలర్ట్

399
cms
- Advertisement -

ఎమ్మెల్యేల కొనుగోళ్ళపై జాతీయ స్థాయిలో చర్చ
బిజేపీయేతర రాష్ట్రాలల్లీ అలర్ట్
ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బిజెపి
2024 నాటికి 400 ఎంపీ సీట్లు బిజెపి టార్గెట్
అందుకే గెలిచే వారికి బిజెపి గాలం…
తెలంగాణ పరిణామాలపై జాతీయనేతల వాకబు
అలర్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్

తెలంగాణలో టి.ఆర్.ఎస్. పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో బిజెపి మధ్యవర్తులు జరిపిన బేరసారాల వ్యవహారం జాతీయస్థాయిలో ప్రధాన చర్చనీయాంశమయ్యింది. బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలను నయానో-భయానో తపు పార్టీలోనికి గుంజుకొన్ల కఘులం పార్టీ పెద్దలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై కనేశారని, అందుకే బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలనీ అలర్ట్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2024 లో జరుగనున్న సార్వత్రిక ఎనికల సమయానికి బిజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలందర్జీ బిజెపిలో చేరేటట్లుగా చేస్తే కనీసం 400 ఎంపీ సీట్లను గెలుచుకోవచ్చుననే వక్కా ప్రణాళికతోనే కపులం పార్టీ పెద్దలు తెలంగాణ రాష్ట్రంపై ఆపరేషన్ ఆకర్షను అపులు చేశారని వివరించారు. ప్రజాదరణ ఉండి, ఆర్ధిక బలం ఉన్న నేతలు ఏ పార్టీలో ఉన్నా వారిని బిజెపిలోకి చేరేటట్లుగా చేయటం, సొంత పార్టీకి ఎమ్మెల్యే-ఎంపీ వదపులకు రాజీనామాలు చేయించి పార్టీలో చేర్చుకొని ఎన్నికలు నిర్వహించి కపులం గుర్తుపై పోటీ చేయించి గెలిపించుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనే వక్కా ప్రణాళికతోనే ఆ పార్టీ టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలతో బేరసారాలు చేసిందనే విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపధ్యంలోనే మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోళ్ళకు జరిగిన బేరసారాల వ్యవహారం జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యిందని అంటున్నారు.

అందుకే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ కూడా అలర్టయ్యారని, కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా జాగ్రత్తపడ్డారని తెలిపారు. ఈ ఇద్దరు నేతలు శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రాపుతో మాట్లాడి జరిగిన విషయాలన్డీ తెలుసుకొన్నట్లుగా న్యూఢిల్లీకి కొందరు సీనియర్ పాత్రికేయులు విపరించారు. ఈ ఇద్దరు నేతలే కాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఘపుతా బెనర్జీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు ఎ.ఐ.సి.సి.కేంద్ర కార్యాలయం నేతలు కూడా అలర్టయ్యి దేశవ్యాప్తంగా ఉన్న తపతపు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల కదలికలపైన నిఘా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల సమయానికి బి.జె.పి.కి ఎక్కడైతే బలం లేదో… ఆయా నియోజకపర్గాల్లో బలమున ఇతర పార్టీల నాయకులకు గాలం వేయడానికి ప్రతి రాష్ట్రంలోనూ మధ్యవర్తులను నియమించుకొని డీల్ కుదిరిన తర్వాతనే పార్టీ అగ్రనేతలను కలిసేటట్లుగా ప్లాన్ చేసుకొని బి.జె.పి. ఆవ రేషన్ ఆకర్షను అషులుచేస్తోందని వివించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారి బి.జె.పి.లో చేరితే వారి స్థాయిని బట్టి మినిషమ్ 50 కోట్ల నుంచి పంద కోట్ల పరకూ ముట్టజెప్పాలని నిర్ణయించినట్లుగా తెలంగాణలో జరిగిన పరిణామాలు స్పష్టంచేస్తున్నాయని, అదే విధంగా ఒక వలుకుబడి-వేరున పార్లమెంట్ సభ్యుడికైనా డబ్బుతోపాటుగా పెద్దపెద్ద కాంట్రాక్టులు ఇవ్వడానికి వీలుగా డీల్స్ కుదుర్చుకోవాలని మధ్యవర్తులను వురమాయించినట్లుగా చెబుతున్నారు.

అంతేగాక కాంగ్రెస్ పార్టీ నుంచి కోపటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ బిజెపిలో చేరతామని హామీ ఇచ్చినందుకే 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చారని, ఒక్క రాజగోపాల్ రెడ్డి కోసమే కాదని, అన్నదమ్ములిద్దరినీ దృష్టిలో ఉంచుకొనే డీల్ కుదిరినట్లుగా తెలిపారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో బి. జెవి.కిందిస్థాయి కేడర్ కొద్దికొద్దిగానే ఉందని, ఎమ్మెల్యే-ఎంపీ వదపులకు పోటీ చేయగలిగే సత్తా ఉన్న నేతలు లేరని, చివరకు తెలంగాణలో కూడా అన్ని నియోజకవర్గాలకు పోటీ చేయగలిగే పరిస్థితులు బిజెపికి లేదని, అందుకే ఇతర పార్టీల నుంచి నాయకులను లాక్కోపడానికే కపులం పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్లుగా ఉందని విపరించారు. అయితే పార్టీ ఫిరాయింవుల చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా అవవాదును మూట గట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకొనే పార్టీకి, వదపులకు రాజీనామాలు చేయించాలని కమలం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొందని, లేకుంటే పుహారాష్ట్రలో మూటగట్టుకొన్న అవవాదునే దేశవ్యాప్తంగా చెడ్డపేరును తెచ్చుకోవాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ప్యూహాన్ని పూర్చినట్లుగా చెబుతున్నారు. అయితే తెలంగాణలో మాత్రం ఇప్పటికివృడు ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదని, తెలంగాణ లో జరుగుతున్న బేరసారాలన్జీ 2023లో జరుగబోయే అసెంబ్లీ ఎనికలు, 2024లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పట్నుంచే పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాలను బిజెపి చేపట్టిందని అంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బిజెపి చేపట్టిన ఆవ రేషన్ ఆకర్ష్ బెడిసికొట్టిందని, టి.ఆర్.ఎస్.ఎమ్మెల్యేలు తిరగబడటంతో కపులం పార్టీ పెద్దలు ఖంగుతిన్నారని అంటున్నారు. అంతేగాక దేశంలోని బిజెపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు, బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రాల్లోని ఇతర పార్టీల అగ్రనేతలందరూ అలర్టయ్యి తపతపు పార్టీల గుర్తులతో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన వారితో చర్చలు జరువుతున్నారని, తపు పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను కాపాడుకునే వనిలో అన్ని పార్టీలు నిష్ఫషుయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. పార్టీలల్లో చీలికలు తెచ్చి రాజకీయంగా వబ్బం గడువుకోవాలని బిజెపి రకరకాల అడ్డదారులు తొక్కుతోందని, అందుకు ఏ పార్టీనైనా చావుదెబ్బ కొట్టాలనే కపులం పార్టీ పెద్దలు ఆవరేషన్ ఆకర్షను ఒక ఉద్యమంలా అషులుచేస్తున్నారని విపరించారు.

అందుకే ప్రస్తుతం బి.జె.పి. ఆడుతున్న గేమ్ ను ప్రజలకు, ప్రజాప్రతినిధులకు కూలంకషంగా విపరించాలని అన్ని పార్టీలూ నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగానే జాతీయ నాయకులు పరుసగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రాపుతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బి.జె.పి.రాజకీయ కుట్రలను బహిర్గతం చేసి ఏకాకిని చేయాలని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కోపదానికి చేసిన బేరసారాలన్లీ బట్టబయలు అయిన విషయం జాతీయస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, అందుకే తపతపు రాష్ట్రాల్లో తెలంగాణ వరిణామాలు వునరావృతం కాకుండా మిగతా రాష్ట్రాల నాయకులు జాగ్రత్తలు తీసుకొంటున్నారని వివరించారు. ఇలా ఆవ రేషన్ ఆకర్ష్ వికటించడంతో రానున్న సార్వత్రిక ఎనికల్లో గానీ, రాష్ట్రాల్లో అధికార వర్గాలను చేపట్టాలనే బిజెపి పెద్దల ప్రయత్నాలు సఫలముపుతాయా? లేక విఫలముపుతాయా? అనేది వేచి చూడాలి. అంతేగాక బి.జె.పి. రాజకీయ ఎత్తుగడలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీగానీ, ప్రాంతీయ పార్టీలుగానీ ఎంత మేరకు విజయం
సాధిస్తాయో … వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి..

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. రెండో ఆడియో లీక్

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఆడియో వైరల్

కృష్ణా బోర్డు దండగ

- Advertisement -