మైత్రి మూవీ మేకర్స్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..

128
Mythri Movie Makers
- Advertisement -

మైత్రి మూవీ మేకర్స్‌,శ్రేయస్ మీడియాపై శనివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 9న హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో ‘అంటే.. సుందరానికీ..’ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే, ఎక్కడా కరోనా నియమాలను పాటించలేదని మైత్రీ మూవీ మేకర్స్, కార్యక్రమ నిర్వహణ సంస్థ శ్రేయస్ మీడియాపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలోనే ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మంచి టాక్ తో నడుస్తోంది. నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా నిన్ననే విడుదలైంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

- Advertisement -