నారా లోకేశ్‌పై కేసు నమోదు…

194
lokesh
- Advertisement -

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌పై కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనంతపురం జిల్లా డి.హిరేహాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

టీడీపీ కార్యకర్తపై కర్ణాటకలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ నిందను రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై ఆపాదిస్తూ లోకేశ్‌ ట్వీట్ చేశారు.
దీనిపై వైసీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయగా లోకేశ్‌పై డి.హిరేహాల్‌ పోలీసులు 111/2021 సెక్షన్లతోపాటు ఐపీపీ 153(ఏ), 505, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

- Advertisement -