ఏపీ మంత్రి కొడాలిపై కేసు నమోదు..

192
kodali
- Advertisement -

ఏపీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌. ఎన్నికల కోడ్‌ ఉల్లఘించిన మంత్రిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కోడ్ ఉల్లంఘించడంతోపాటు బెదిరించడం, కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మంత్రిపై ( ఐపీసీ 504, 505, 506) సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఎస్పీకి పంపిన లేఖలో ఎస్ఈసీ పేర్కొన్నారు.

నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌పై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. శుక్రవారం ఎస్ఈసీ పై మంత్రి కొడాలి అనుచిత వ్యాఖ్యలు చేయగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన న్యాయవాదితో కొడాలి నాని వివరణ ఇచ్చిన ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందలేదు.

- Advertisement -