టీకాలు వేయించుకున్నవారు బాహుబలులు!

111
modi
- Advertisement -

టీకాలు వేయించుకున్న వారు బాహుబలులు అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మోదీ…ఇప్పటివరకు 40 కోట్ల మంది టీకాలు తీసుకున్నారని వారంతా బాహుబలులు అని కొనియాడారు.

ప్ర‌తి ఒక్క‌రూ క‌నీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుని ఉంటార‌ని, ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ నియ‌మావ‌ళిని పాటించాల‌న్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు స‌జావుగా సాగాల‌ని, ప్ర‌తి ఒక్క సీఎంతో తాను చ‌ర్చించాన‌న్నారు. ప్ర‌పంచం అంతా మ‌హ‌మ్మారితో స‌త‌మ‌తం అయ్యింద‌ని, పార్ల‌మెంట్‌లో ఈ అంశంపై అర్థ‌వంత‌మైన చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు.

ప్ర‌తి ఒక పార్టీకి చెందిన ఎంపీలు అత్యంత క‌ఠిన‌మై ప్ర‌శ్న‌లు వేయాల‌ని, కానీ ఆ ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం స‌మాధానం ఇచ్చేలా అనుమ‌తించాల‌ని కోరారు. సభ సజావుగా జరిగితేనే ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌లిగి, అభివృద్ధి వేగ‌వంతం అవుతుంద‌ని చెప్పారు ప్రధాని.

- Advertisement -