కేంద్రంలో వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టింది మోదీ సర్కారు. గురువారం రెండోసారి తిరిగి భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ.. తన కేబినెట్లో చోటు సంపాదించుకున్న మంత్రులకు శాఖలు కేటాయించారు. 57 మందితో కొలువుదీరిన కొత్త కేబినెట్ లో 24 మందికి కేబినెట్, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. అయితే 2014లో మోదీ టీమ్తో పోలిస్తే ప్రస్తుతం ఉన్న టీమ్ ఎన్నో ప్రత్యేకతలు కలిగిన వుంది.
ఆ ప్రత్యేకతలు ఇవే..
– దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఏఐఏడీఎంకే ఎంపీకి కేంద్ర కేబినెట్లో స్థానం లభించడం
– మంత్రివర్గంలో చోటుదక్కని ప్రముఖుల్లో మేనకాగాంధీ, రాధామోహన్ సింగ్, జయంత్ సిన్హా, అనుప్రియా పటేల్, రామ్ కృపాల్ యాదవ్, రాజవర్థన్ సింగ్ రాథోడ్, అనంత్ కుమార్ హెగ్డే తదితరులు ఉండటం.
– గత కేబినెట్లో మంత్రులుగా ఉండి ఓడిపోయిన వారిలో మనోజ్ సిన్హా, అల్ఫోన్స్ కన్నంతనమ్, హన్స్ రాజ్ ఆహిర్ లు ఉండడం ఆసక్తికర విషయం.
– గత కేబినెట్లో మంత్రులుగా ఉన్న సురేష్ ప్రభు, సుష్మా స్వరాజ్, ఉమా భారతి, బీరేంద్ర సింగ్, అరుణ్ జైట్లీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
– ఓడిపోయినప్పటికీ పదవిని దక్కించుకున్న ఎంపీగా హర్దీప్ సింగ్ పురి నిలువగా నిలిచారు.
– గత కేబినెట్లో మంత్రిగా ఉండి టికెట్ను పొందలేకపోయిన వ్యక్తిగా విజయ్ సంప్లా నిలిచారు.
– గత కేబినెట్ లో 8 మంది మహిళలుండగా, ఈ దఫా 6కు తగ్గింది.
– గరిష్ఠంగా ఉత్తరప్రదేశ్కు చెందిన 9 మందికి మంత్రి పదవులు దక్కడం.