ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

12
- Advertisement -

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు మోడీ.ఈనెల 7, 8 తేదీల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గోనున్నారు.

రాజమహేంద్రవరంలో కూటమి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరికి మద్దతుగా 7వ తేదీ సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు మోడీ. సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో, 8వ తేదీ సాయంత్రం 4గంటలకు పీలేరు సభలో మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. అదేరోజు రాత్రి 7గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్ షోలో మోడీ పాల్గోనున్నారు.

తెలంగాణలో 8, 10 తేదీల్లో ప్రచారం నిర్వహించనున్నారు మోడీ. 8న వేములవాడ, వరంగల్ సభల్లో పాల్గోనున్న ప్రధాని.. 10న మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

Also Read:‘ఆ ఒక్కటీ అడక్కు’ ..క్లీన్ ఎంటర్ టైనర్

- Advertisement -