కరోనా టీకా వేయించుకున్న ప్రధాని మోదీ..

159
pm modi
- Advertisement -

దేశంలో ఈరోజు కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను ప్రధానికి వేశారు. ఎయిమ్స్ సిస్టర్ పి.నివేదా సిరంజి ద్వారా మోదీకి టీకా ఇచ్చారు. తాను కరోనా టీకా తీసుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మోదీ.. కరోనా​కు వ్యతిరేకంగా వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని కొనియాడారు. అర్హులైనవారందరూ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి దేశాన్ని కొవిడ్ రహితంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ.

- Advertisement -