ఊహించని రీతిలో పాక్ను దెబ్బకొట్టాం అని మరోసారి స్పష్టం చేశారు. బిహార్ పర్యటనలో భాగంగా మాట్లాడిన మోదీ…ఉగ్రవాదుల స్థావరాలు శిథిలాలుగా మార్చామని, నిమిషాల్లోనే పాకిస్థాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామన్నామని ఇదే నవ భారత బలమని చెప్పారు. ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తామని బిహార్ గడ్డపై దేశానికి వాగ్దానం చేశాను. వారికి ఊహకు అందని శిక్ష విధిస్తామని చెప్పాను. నా వాగ్దానాన్ని నేను నెరవేర్చాను అని వెల్లడించారు.
పాకిస్థాన్లో కూర్చుని మన సోదరీమణుల సిందూరాన్ని చెరిపేసిన వారిని, వారి స్థావరాలను శిథిలాలుగా మార్చింది. పాకిస్థాన్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం సిందూర శక్తిని చూసింది అన్నారు. పాక్ ఆర్మీ నీడలో తాము సురక్షితంగా ఉంటామని ఉగ్రవాదులు భావించారు కానీ మనం ఆ దేశ సైన్యాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టాం అని వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ భారత్ అమ్ములపొదిలో కేవలం ఒక బాణం మాత్రమే అని….ఉగ్రవాదంపై మన యుద్ధం ముగియలేదు అని స్పష్టం చేశారు. మరోసారి ఉగ్రదాడి జరిగితే ఈసారి ఆ పాము తలే ధ్వంసమవుతుంది అని స్పష్టం చేశారు.
Also Read:కెనడాలో కార్చిచ్చు కలకలం..

