వీర జవాన్లకు సెల్యూట్..

64
modi
- Advertisement -

హిమాల‌య ప‌ర్వ‌త శ్రేణుల‌ను పాకిస్థాన్ ఆక్ర‌మ‌ణ‌దారుల నుంచి సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఇవాళ భారత సైన్యం చేజిక్కించుకున్న‌ది. ఈ నేపథ్యంలో యావత్ భారతం వీరజవాన్ల సేవలను స్మరించుకుంటున్నారు.

కార్గిల్ విజ‌య దివ‌స్ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. భార‌త మాత గ‌ర్వంగా, ఘ‌నంగా ఫీల‌వ్వ‌డానికి కార్గిల్ విజ‌య్ దివ‌స్ న‌మూనాగా నిలుస్తుంద‌న్నారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన‌వారంద‌రికీ ఆయ‌న సెల్యూట్ చేశారు.

కార్గిల్ అమ‌ర జ‌వాన్ల‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము నివాళి అర్పించారు. అసాధార‌ణ ధైర్యసాహాసాల‌కు కార్గిల్ దివ‌స్ సింబ‌ల్‌గా నిలుస్తుంద‌న్నారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల‌కు ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళి అర్పించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛంతో నివాళి తెలిపారు. కార్గిల్ యుద్ధంలో విరోచితంగా పోరాడిన వీర సైనికుల్ని రాజ్‌నాథ్ కొనియాడారు.

- Advertisement -