కృష్ణంరాజు మృతి…మోడీ, షా దిగ్బ్రాంతి

77
modi
- Advertisement -

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్ షా. రాబోయే తరాలు ఆయన సినిమా క్రియేటివిటీని గుర్తుంచుకుంటాయన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. సమాజ సేవలోనూ ముందున్న కృష్ణంరాజు.. రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.

కృష్ణంరాజు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను అని చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. బహుముఖ నటనతో, సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను ఆయన గెలుచుకున్నారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది. ఓం శాంతి అమిత్ షా తెలుగులో ట్వీట్ చేశారు.

- Advertisement -