Modi:కేసీఆర్ త్వరగా కోలుకోవాలి..థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్

40
- Advertisement -

గురువారం అర్థరాత్రి కాలు జారి కింద పడటంతో గాయపడిన కేసీఆర్‌ను సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

కేసీఆర్‌కు గాయమైన విషయం తెలియగానే చాలా బాధపడ్డానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ జరగాల్సి ఉందని తెలిపారు కేటీఆర్. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్న వారందరికి థ్యాంక్స్ చెప్పారు.కేసీఆర్‌పై అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -