హర్యానా యమునా నగర్ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేసిన మోడీ… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది అన్నారు. అలాగే హెచ్ సి యు కంచ గచ్చిబౌలి భూములపై తొలిసారిగా స్పందించారు ప్రధాని మోడీ.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుంది అన్నారు. బిజెపి మంచిపనులు చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ ఉన్న అడవులను నాశనం చేస్తుంది అని… ప్రకృతి,జంతువులకు నష్టం జరిగితే ప్రమాదం అన్నారు. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతున్నారు… కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మకద్రోహం జరుగుతుంది అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో ప్రజలు ఆందోళనలో అభివృద్ధి కుంటు పడింది… కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు,బస్సు కిరాయి వరకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి అన్నారు. కర్ణాటక ప్రభుత్వం రేట్లు , పన్నులు పెంచింది… కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసింది అన్నారు. సత్యం ఆధారంగా , ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ బిజెపి ముందుకు వెళ్తుంది.. వికసిత భారత్ కోసం బిజెపి పని చేస్తుంది అన్నారు.
Also Read:ఓటీటీలో ఛావా.. వారికి నిరాశే!