తెలంగాణకు మోడీ..భారీ బహిరంగసభ

7
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. మెదక్‌లో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మెదక్ జిల్లా అల్లాదుర్గ్ శివారులో భారీ బహిరంగ సభలో పాల్గొనుండగా సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరానున్నారు.

మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాలకు మధ్యలో ఉండే అల్లాదుర్గంలో ఈ బహిరంగసభ ఏర్పాటు చేయనుండగా దాదాపు 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సభకు విశాల్ జనసభ అనే పేరును ఖరారు చేయగా దేశం కోసం, ధర్మం కోసం నిర్వహిస్తున్న ఈ సభకు ప్రధాని ముఖ్య అతిథిగా వస్తున్నారని బీబీ పాటిల్ తెలిపారు. లో ప్రధాన మంత్రి మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని తెలిపారు. అభివృద్ధి అంటేనే బీజేపీ అని, ప్రజలు తమకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

Also Read:సలార్ 2…మేలో స్టార్ట్!

- Advertisement -