కరీంనగర్‌కు రేవంత్..

9
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ కరీంనగర్, వరంగల్, చేవెళ్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు,సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు బాలాపూర్, బడంగ్‌పేట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు అందరూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.దక్షిణాదిన మెజార్టీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికను సిద్ధం చేసింది.

Also Read:సలార్ 2…మేలో స్టార్ట్!

- Advertisement -