హైదరాబాద్‌కు మోదీ.. షెడ్యూల్ ఇదే!

28
modi
- Advertisement -

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్‌కు రానున్నారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనుండగా ఇవాళ మధ్యాహ్నం 2.55 గంటలకు మోదీ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. మాదాపూర్ లోని హెచ్ఐసీసీ ప్రాంగణంలో సమావేశాలు జరగనుండగా ఇప్పటికే జాతీయ నేతలు హైదరాబాద్‌కు చేరుకున్నారు.

మోడీ టూర్ షెడ్యూల్ ఇదే…

()శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరుతారు.
() మధ్యాహ్న2.55 గంటల సమయంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటాంరు.
() బేగంపేట నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో మోదీ బసచేసే నోవాటెల్ హోటల్ కు బయలుదేరుతారు.
() 3.30 గంటలకు హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు రిజర్వ్‌ సమయంగా ఉంచారు.
()సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
() రాత్రి 9గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్ గా ఉంచారు.
() ఆదివారం ఉదయం 10గంటల సమయంలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు.
() ఆదివారం సాయంత్రం 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్‌గా ఉంచారు.
() సాయంత్రం 5.55 గంటలకు హైటెక్స్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 6.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
() బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన బహిరంగ సభా ప్రాంగణానికి మోదీ సాయంత్రం 6.30 గంటలకు చేరుకుంటాంరు.
() రాత్రి 7.30 గంటల వరకు సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు.
() ఆదివారం రాత్రి 7.35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి రాజ్‌భవన్‌ కు లేదా నోవాటెల్ హోటల్‌కు గానీ చేరుకుని బస చేస్తారు.
() సోమవారం ఉదయం 9.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో ఏపీకి బయటుదేరుతారు.
() 10గంటల సమయంలో విజవాడ చేరుకొని ఏపీలోని కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు.

- Advertisement -