ఈ రోజు సంపూర్ణ విశ్వం రామమయమైంది అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ధర్మ ధ్వజం కేవలం జెండా కాదు.. భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం అన్నారు. నేటితో రామ భక్తుల సంకల్పం సిద్ధించింది …ఈ వైభవం మరో 500 ఏళ్ల పాటు కొనసాగుతుంది అన్నారు.
అయోధ్య రామ మందిరంపై కాషాయ జెండా ఎగురవేసిన మోదీ..అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన మోదీ.. శతాబ్దాల గాయాలు మానుతున్నాయి… శతాబ్దాల వేదన నేడు దూరమవుతోంది. శతాబ్దాల సంకల్పం నేడు నెరవేరుతోంది. 500 సంవత్సరాలుగా రాజుకున్న త్యాగపు అగ్ని నేడు సంపూర్ణమైంది అని అన్నారు.
నేడు, మొత్తం భారతదేశం మరియు ప్రపంచం రామమయంగా మారింది. ప్రతి రామ భక్తుని హృదయంలో అసాధారణ సంతృప్తి ఉంది. అనంతమైన కృతజ్ఞత ఉంది. అపారమైన అతీంద్రియ ఆనందం ఉంది అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ మాట్లాడుతూ..ఈ రోజు మనందరికీ చాలా ముఖ్యమైన రోజు. చాలా మంది ఈ క్షణం కోసం కలలు కన్నారు, చాలా మంది ప్రయత్నాలు చేశారు, చాలా మంది త్యాగాలు చేశారు. ఈరోజు వారి ఆత్మలు సంతోషిస్తూ ఉండాలి అని అన్నారు.
అశోక్ సింఘాల్, మహంత్ రామచంద్ర దాస్ జీ మహరాజ్, దాల్మియా జీ మరియు అనేక మంది సాధువులు ఈ కల నెరవేరడానికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆలయం ఇప్పుడు నిర్మించబడింది, మరియు ఈరోజు ఆలయం యొక్క ‘శాస్త్రీయ ప్రక్రియ’ పూర్తయింది. ధ్వజారోహణం నేడు పూర్తయింది అని తెలిపారు.
Also Read:#పూరిసేతుపతి..షూటింగ్ అప్డేట్

