100 రూపాయల నాణెం వచ్చేసింది..

290
- Advertisement -

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ 94వ జయంతి సందర్భంగా భారత ప్రదాని నరేంద్ర మోదీ ఈరోజు రూ. 100 నాణేన్ని విడుదల చేశారు. వాజ్ పేయి జయంతి వేడుకలను పురస్కరించుకుని… ఒక రోజు ముందే నాణేన్ని విడుదల చేశారు. ఈ నాణేనికి ఒకవైపు వాజ్ పేయి చిత్రంతో పాటు… ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఆయన పేరును ముద్రించారు. మరోవైపు మూడు సింహాల చిహ్నం, సత్యమేవ జయతే నినాదం, రూ. 100 అంకెతో పాటు మన దేశం పేరును హిందీ, ఇంగ్లీషు భాషల్లో ముద్రించారు. ఈ నాణెం బరురు 35 గ్రాములు.

Rs.100 Coin

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వాజ్‌పేయీ సేవలను గుర్తుచేసుకున్నారు. అటల్‌ జీ లేరు అని నమ్మడానికి తన మనసు అంగీకరించడం లేదని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్యం కారణంగా దాదాపు దశాబ్దం పాటు ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ఆయనను ఎవరూ మర్చిపోలేదని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యం మహోన్నతంగా ఉండాలని అటల్‌ జీ ఎప్పుడూ కోరుకునేవారు.

Rs.100 Coin

పార్టీ సిద్ధాంతాలపై ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు. భాజపాను అతిపెద్ద రాజకీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషిచేశారని మోదీ అన్నారు. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో భాజపా అగ్రనేత, వాజ్‌పేయీ సన్నిహితుడు ఎల్‌కే అడ్వాణీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -