త్వరలో ప్లాస్టిక్ నోట్లు….

235
- Advertisement -

నోట్ల రద్దుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్‌మనీకి చెక్‌పెట్టే విధంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయన్ని ప్రతిపక్షలు తీవ్రగా వ్యతిరేకిస్తున్నాయి. నోట్ల రద్దుపై మోడీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలంమైదని పార్లమెంట్‌లో రోజు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే,…పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో గందరగోళం కొనసాగుతుండగానే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై ప్లాస్టిక్‌ కరెన్సీ ముద్రించాలని నిర్ణయించినట్లు శుక్రవారం పార్లమెంట్‌లో తెలిపింది. కరెన్సీ నోట్లను ప్లాస్టిక్‌ లేదా పాలిమర్స్‌తో ముద్రించాలని నిర్ణయించామని, దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలో ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జన్ రామ్‌ మేఘ్వాల్‌ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Plastic notes soon says Arjun Ram

పేపర్‌ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్‌ కరెన్సీ ప్రవేశపెట్టాలని కొన్నాళ్ల క్రితం ఆర్బీఐ ప్రతిపాదించింది. పది రూపాయల విలువ గల వందకోట్ల ప్లాస్టిక్‌ నోట్లను ప్రయోగాత్మకంగా దేశంలోని భౌగోళిక వైవిధ్యం గల కొచ్చి, మైసూర్, భువనేశ్వర్, జైపూ ర్, సిమ్లా నగరాల్లో ప్రవేశపెట్టనున్నట్లు 2014లో ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపిందని, దానికి కొనసాగింపు ప్రయత్నంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు.

లోక్‌సభలో మంత్రి మేఘ్వాల్‌ మరోప్రశ్నకు సమాధానమిస్తూ 2015 డిసెంబర్‌లో ఎటువంటి సెక్యూరిటీ త్రెడ్‌ లేని రూ.1000 నోట్లు కొన్ని తమకు వచ్చినట్లు ఆర్బీఐ తెలిపిందని, ఇవి నాసిక్‌లోని కరెన్సీ ముద్రణా కేంద్రం నుంచి వచ్చాయని, హోసంగాబాద్‌లోని సెక్యూరిటీ పేపర్‌ మిల్‌ సరఫరా చేసిన పేపర్‌పై ఈ నోట్లు ముద్రించినట్లు తెలిపారు.

Plastic notes soon says Arjun Ram

ఇందుకు బాధ్యులైన సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచామని రామ్‌ మేఘ్వాల్‌ పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ నోట్ల జీవితకాలం ఐదేళ్లవరకూ ఉంటుంది. వీటికి నకిలీలు తయారుచేయడం కూడా చాలా కష్టం. అదీగాక పేపర్‌ కరెన్సీ కంటే ప్లాస్టిక్‌ నోట్లు పరిశుభ్రంగా ఉంటాయని మంత్రి ఈ సంద్భరంగా తెలియజేశారు.

- Advertisement -