పీయూష్ పాండే ఇకలేరు..ప్రముఖుల సంతాపం

2
- Advertisement -

భారతీయ ప్రకటనల రంగంలో లెజెండరీ వ్యక్తి అయిన పీయూష్ పాండే ఇకలేరు. ‘హమారా బజాజ్’, పోలియో ఉద్యమంలోని ‘దో బూంద్ జిందగీ కీ’, అలాగే 2014లోని ‘అబ్ కీ బార్, మోది ప్రభుత్వం’ వంటి చారిత్రాత్మక ప్రకటనల వెనుక ఉంది పీయూష్ పాండే.

ప్రకటనల రంగంలో తనదైన ముద్రవేసిన పీయూష్ పాండే ఈ ఉదయం కన్నుమూశారు. నలభై ఏళ్లకు పైగా కొనసాగిన ఆయన కెరీర్‌లో, మరణానికి నెల రోజుల ముందు ఆయన కోమాలో ఉన్నారని సమాచారం. 1982లో ఒగిల్వీ అండ్ మాథర్ ఇండియా (ప్రస్తుతం ఒగిల్వీ ఇండియా)లో ట్రైనీ అకౌంట్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రారంభించారు. అనంతరం క్రియేటివ్ విభాగంలో చేరి, జాతీయ క్రియేటివ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ (ఇండియా), గ్లోబల్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ వంటి అగ్రస్థానాలను అధిరోహించారు.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , పీయూష్ పాండే మరణంపై సంతాపం తెలియజేశారు. పీయూష్ పాండే తన సృజనాత్మకతతో అందరి అభిమానాన్ని పొందారు. ఆయన ప్రకటనలు మరియు కమ్యూనికేషన్ ప్రపంచానికి విశేషమైన సేవలను అందించారు. సంవత్సరాలుగా ఆయనతో జరిగిన నా అనుభవాలను ఎప్పటికీ స్మరించుకుంటాను. ఆయన మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి,” అని ప్రధాన మంత్రి మోదీ ఎక్స్‌లో (X) వ్రాశారు.

భారతీయ ప్రకటనల రంగానికి అద్భుతమైన సృజనాత్మకతతో, అపారమైన ఆసక్తితో పునాది వేసిన లెజెండరీ అడ్వర్టైజింగ్ ప్రతిభావంతుడు, పద్మశ్రీ పీయూష్ పాండే గారికి నా హృదయపూర్వక సానుభూతి అని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అన్నారు కేటీఆర్.

Also Read:శ్రీ విష్ణుతో నయన్ సారిక

 

- Advertisement -