తల్లి ఆశీస్సులు తీసుకున్న మోదీ

252
pm-modi-with-mother
- Advertisement -

మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి రెండోసారి భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఈనెల 30న ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు మోదీ. కాగా నిన్న సాయంత్రం గుజరాత్ లోని తన తల్లి వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు మోదీ. నిన్న సాయంత్రం గాంధీ నగర్ వచ్చిన మోదీ తల్లి హీరాబెన్‌ను కలిసి పాదాలకు నమస్కరించారు.

అనంతరం ఆమెతో కాసేపు గడపి ముచ్చటించారు. ఇక తల్లికి కలవడానికి ముందు నర్మదా నది ఒడ్డున ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు మోదీ. ఇక నేడు వారణాసికి వెళ్లనున్నారు మోదీ. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపనున్నారు.

- Advertisement -