ఈ నెల 16న రెండో విడుత గొర్రెల పంపిణీ..

144
Minister talasani
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈ నెల 16న నల్లగొండలో రెండో విడుత గొర్రెల పంపిణీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ. 360 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 2 కోట్ల గొర్రెల సంపద సృష్టించామని వివరించారు. గొల్ల, కురుమల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు.

కాగా, తొలి విడుత గొర్రెల యూనిట్ల కోసం డీడీలు కట్టిన 30 వేల మంది లబ్ధిదారులకు ఇంకా పంపిణీ చేయాల్సి ఉందని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వెంటనే పంపిణీ పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తొలి విడుత 7.61 లక్షల గొర్రెలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటివరకు 76.93 లక్షల గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు.

- Advertisement -