ఆగని పెట్రో మంట..!

224
kcr
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రోజువారి సమీక్షలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి చమురు సంస్థలు. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.64కు పెరగగా… డీజిల్‌ ధర 97.37కు చేరింది. హైదరాబాద్‌ విషయానికి వస్తే.. పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది.. దీంతో.. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113కు చేరితే.. డీజిల్‌ ధర రూ.106.22కి చేరింది.

ముంబైలో పెట్రోల్‌ ధర రూ.114.47కు, డీజిల్‌ ధర రూ.105.49కు చేరగా కోల్‌కతాలో పెట్రోల్‌, డీజిల్‌ ధర వరుసగా రూ.109.02, రూ.100.49 చేరాయి. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.43కి, లీటర్‌ డీజిల్‌ ధర రూ.101.59గా ఉంది.

- Advertisement -