మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..

371
petrol
- Advertisement -

వినియోగదారులకు షాక్..పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దేశంలో మూడోరోజూ పెరిగాయి. శనివారం లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.14, డీజిల్‌ రూ.90.48కి చేరగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.26,డీజీల్ ధర రూ. 98.72గా ఉంది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.57, లీటర్ డీజీల్ ధర రూ. 100.45గా ఉండగా ,విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ. 107.19, లీటర్ డీజీల్ ధర రూ. 99.14, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.19, డీజీల్ ధర రూ. 98.16గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో లీటర్‌ డీజిల్‌ ధర సైతం ధర రూ.100 దాటింది.

- Advertisement -