ఐదో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు…

221
petrol price
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి.వరుసగా ఐదోరోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 8 పైస‌లు, డీజిల్‌పై 18 నుంచి 20 పైస‌లు పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.81.59కి, డీజిల్ ధ‌ర రూ.71.41కి పెరిగింది.

హైద‌రాబాద్‌లో పెట్రోల్ రూ.84.86 డీజిల్ రూ.77.93గా ఉండగా ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.88.29, డీజిల్ ధ‌ర రూ.77.90గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.84.64, డీజిల్ రూ.76.88, కోల్‌క‌తాలో పెట్రోల్‌ రూ.83.15, డీజిల్ రూ.74.98గా పెట్రోల్ ధరలున్నాయి.

- Advertisement -