మరింత పెరిగిన పెట్రోల్ ధరలు!

201
petrol
- Advertisement -

దేశంలో పెట్రోల్ ధరలు మరింత పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో మొట్టమొదటిసారి రూ.85 మార్క్‌‌‌‌ను దాటేసింది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరను లీటరుపై 25 పైసలు పెరిగాయి. లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.85.20కు చేరగా.. లీటరు డీజిల్ ధర రూ.75.38కు చేరింది.

హైదరాబాద్‌‌‌‌లో లీటరు పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.88.63గా ఉంటే.. 27 పైసలు పెరిగి లీటర్‌ డీజిల్‌ ధర రూ.82.26కు చేరింది. ముంబైలో పెట్రోల్ రూ.91.80, డీజిల్‌ రూ.82.13కు చేరుకొని ఆల్‌టైం హై రికార్డు నమోదు చేసింది.

- Advertisement -