పవన్ కళ్యాణ్‌పై హైకోర్టులో పిటిషన్

5
- Advertisement -

సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులు వాడుకున్నారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు విజయ్ కుమార్. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.

విచారణను వారం రోజులకు వాయిదా వేసింది హైకోర్టు.

Also Read:తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

- Advertisement -